విద్యార్థుల్లో విలువలు పెంచేందుకు శతక పద్యాలు దోహదం

by Sridhar Babu |
విద్యార్థుల్లో విలువలు పెంచేందుకు శతక పద్యాలు దోహదం
X

దిశ, సత్తుపల్లి : ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులలో నైతిక విలువలతో పాటు మాతృభాషలో నైపుణ్యాలను పెంపొందించడానికి శతక పద్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన అన్నారు. గురువారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బి.మధుసూదన రాజు, పీఆర్టీయూ, టీఎస్​ విద్యా విషయక మాస పత్రిక సబ్ ఎడిటర్ చిత్తలూరి ప్రసాద్ లు తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ ను కలిసి వేమన భాషామృతం పుస్తకాన్ని అందచేశారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్కూల్ కంప్లెక్స్ పరిధిలో గతంలో ఈ పుస్తకాన్ని వినియోగించి సత్ఫలితాలు పొందినట్లు తెలిపారు. పుస్తకాన్ని పరిశీలించిన దేవసేన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్ధులకు ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. విద్యాశాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందే విధంగా చర్య తీసుకుంటానని ఈ సందర్భంగా ఆమె వివరించారు. ఎస్సీఈ ఆర్టీకి వేమన భాషామృతాన్ని పంపారు.

విద్యాశాఖ మంత్రికి, డైరెక్టర్ కు కృతజ్ఞతలు

సత్తుపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో రూపొందించిన వేమన భాషామృతం పుస్తకాన్ని పరిశీలించి అమలుకు తగు చర్య తీసుకుంటున్న తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ దేవసేనలకు సహకరించిన పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ లకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మధుసూదనరాజు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధికార మాస పత్రిక సబ్ ఎడిటర్ చిత్తలూరి ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.



Next Story