- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సెల్ ఫోన్ దొంగల అరెస్ట్

దిశ, భద్రాచలం : భద్రాచలంలోని రామాలయానికి వస్తున్న భక్తులను టార్గెట్ చేస్తూ సెల్ఫోన్ల దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలంకు చెందిన బానోతు ఫణి కుమార్, మధులను పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. వారి దగ్గర నుంచి 16 సెల్ ఫోన్లు రికవరీ చేసుకున్నారు. వీటి విలువ సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.
భద్రాచలంలోని రామున్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను, ఆదమర్చి ఉన్నవారిని టార్గెట్గా చేసుకొని ఆలయ ప్రాంతంలోని కరకట్ట మరియు బహిరంగ ప్రదేశాల్లో నిద్రిస్తున్న సమయంలో వారి సెల్ఫోన్లను దొంగిలిస్తున్నారు. జల్సా లకు అలవాటు పడిన వీరు దొంగతనాలు చేస్తూ వాటిని అమ్ముకొని వాళ్ల సరదాలు తీర్చుకుంటున్నారు. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో అదును చూసి పట్టుకొని వారి దగ్గర 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సైలు శ్రీకాంత్, మధు ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.