- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ సరైంది కాదు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు

దిశ ఖమ్మం టౌన్ : శాసనమండలి సభ్యురాలు కవితపై జరుగుతున్న సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉందని, విచారణ నిష్పక్షపాతంగా జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనసభ్యుల కొనుగోలు అంశం విఫలం కావడంతో సీబీఐ ఈడీ విచారణ వేగవంతం చేసిందన్నారు. బీఆర్ఎస్ నాయకులను బెదిరించి బీజేపీలో చేర్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఉందన్నారు. ఖమ్మంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి, మంత్రి మల్లారెడ్డి ఇండ్లపై సోదాలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. దేశంలో కోట్ల రూపాయలు ఉన్న అనిల్ అంబానీ సోదరుల మీద సీబీఐ విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ నాయకులపై కక్షపూరితంగా విచారణలు చేపట్టడం ఎంతవరకు సబబు అన్నారు. కవితపై విచారణ లైవ్ లో చేయాలని కోరారు.