ఘోర రోడ్డు ప్రమాదం.., కారు, ఆటో ఢీ...

by Sridhar Babu |
ఘోర రోడ్డు ప్రమాదం.., కారు, ఆటో ఢీ...
X

దిశ, దుమ్ముగూడెం : మండల పరిధిలోని తూరుబాక బ్రిడ్జి మూలమలుపు వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చర్ల నుంచి భద్రాచలం పాసింజర్లతో వెళ్తున్న ఆటో, ఏలూరు జిల్లాకు చెందిన కారు దుమ్ముగూడెం వైపు వస్తూ ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇసుక లారీలు అధికలోడుతో తిరగటం వల్ల మూలమలుపు వద్ద రోడ్డు తీవ్రంగా ధ్వంసం అవ్వటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. రోడ్డు మరమ్మతులు చేయకపోతే మరిన్ని ప్రమాదాలకి అవకాశం ఉందని పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఈ ప్రమాదంలో సల్మాన్, మీడియం కుమార్, గోపి ఆటోలో ప్రయాణిస్తుండగా తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. కారు మోదుగు చెట్టుకు ఢీకొని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.



Next Story