- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఘోర రోడ్డు ప్రమాదం.., కారు, ఆటో ఢీ...
by Sridhar Babu |

X
దిశ, దుమ్ముగూడెం : మండల పరిధిలోని తూరుబాక బ్రిడ్జి మూలమలుపు వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చర్ల నుంచి భద్రాచలం పాసింజర్లతో వెళ్తున్న ఆటో, ఏలూరు జిల్లాకు చెందిన కారు దుమ్ముగూడెం వైపు వస్తూ ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇసుక లారీలు అధికలోడుతో తిరగటం వల్ల మూలమలుపు వద్ద రోడ్డు తీవ్రంగా ధ్వంసం అవ్వటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. రోడ్డు మరమ్మతులు చేయకపోతే మరిన్ని ప్రమాదాలకి అవకాశం ఉందని పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఈ ప్రమాదంలో సల్మాన్, మీడియం కుమార్, గోపి ఆటోలో ప్రయాణిస్తుండగా తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. కారు మోదుగు చెట్టుకు ఢీకొని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
Next Story