కారు, ఆటో ఢీ... ఒకరు మృతి

by Sridhar Babu |
కారు, ఆటో ఢీ... ఒకరు మృతి
X

దిశ, సత్తుపల్లి : కారు, ఆటో ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన సత్తుపల్లి పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని మసీదు రోడ్డుకు చెందిన బొర్రా వెంకటేశ్వరరావు( 50) తన అక్క సత్యవతిని చాట్రాయి మండలం బురుగు గూడెం నుంచి ఆటోలో సత్తుపల్లి కి తీసుకొని వస్తుండగా వేంసూరులో గల మెట్ట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో సత్తుపల్లి నుండి వెళుతున్న కారు ఢీకొట్టింది. దాంతో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ లక్ష్మణుకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో ఆయన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story