- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పనికిరమ్మని పిలిచి...

దిశ, ఖమ్మం రూరల్ : పనికి రమ్మని పిలిచి ఓ గుర్తు తెలియని వ్యక్తి మహిళ చెవులకు ఉన్న బంగారు దిద్దులను దోచుకున్న సంఘటన రూరల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం నగరం కవిరాజ్నగర్కు చెందిన జొన్నలగ్డ లక్ష్మి ప్రతి రోజు కూలిపనికి వెళ్తుంది. సోమవారం కూడా రోజులాగానే పనికోసం ఇల్లందు క్రాస్రోడ్డు వద్ద గల అడ్డా వద్దకు వెళ్లగా ఓ వ్యక్తి వచ్చి రూరల్ మండలం కరుణగిరి వద్ద ఫంక్షన్ ఉందని, పనిచేయాలని తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఫంక్షన్స్ జరుగుతుండటంతో ఇవి మా ఫంక్షన్స్ కావని, బంధువులు రావడం కొంత సమయం పడుతుందని అంత వరకు మనం కట్టెలు తీసుకొద్దామని చెప్పి నిర్మానుష్యం గల స్థలంలోకి తీసుకెళ్లి కర్రతో బెధిరించి చెవులకు ఉన్న బంగారపు దిద్దులు, డబ్బులు, సెల్ఫోన్ ను దోచుకొని పరారయ్యాడు. మంగళవారం రూరల్ ఎస్ఐ వెంకటక్రిష్ణకు బాధితురాలు లక్ష్మి ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ చేస్తున్నారు.