పనికిరమ్మని పిలిచి...

by Sridhar Babu |
పనికిరమ్మని పిలిచి...
X

దిశ, ఖమ్మం రూరల్​ : పనికి రమ్మని పిలిచి ఓ గుర్తు తెలియని వ్యక్తి మహిళ చెవులకు ఉన్న బంగారు దిద్దులను దోచుకున్న సంఘటన రూరల్​ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం నగరం కవిరాజ్​నగర్​కు చెందిన జొన్నలగ్డ లక్ష్మి ప్రతి రోజు కూలిపనికి వెళ్తుంది. సోమవారం కూడా రోజులాగానే పనికోసం ఇల్లందు క్రాస్​రోడ్డు వద్ద గల అడ్డా వద్దకు వెళ్లగా ఓ వ్యక్తి వచ్చి రూరల్​ మండలం కరుణగిరి వద్ద ఫంక్షన్​ ఉందని, పనిచేయాలని తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఫంక్షన్స్​ జరుగుతుండటంతో ఇవి మా ఫంక్షన్స్​ కావని, బంధువులు రావడం కొంత సమయం పడుతుందని అంత వరకు మనం కట్టెలు తీసుకొద్దామని చెప్పి నిర్మానుష్యం గల స్థలంలోకి తీసుకెళ్లి కర్రతో బెధిరించి చెవులకు ఉన్న బంగారపు దిద్దులు, డబ్బులు, సెల్​ఫోన్​ ను దోచుకొని పరారయ్యాడు. మంగళవారం రూరల్​ ఎస్​ఐ వెంకటక్రిష్ణకు బాధితురాలు లక్ష్మి ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ చేస్తున్నారు.



Next Story