- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వెళ్తున్న బస్సులను ఆపి ధర్నా చేసిన బస్ డ్రైవర్లు

దిశ, ఖమ్మం సిటీ: సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో బస్టాండ్ లోకి వస్తున్న బస్సుకు అడ్డంగా మోటార్ సైకిల్ ఎందుకు నడిపావు అని అడిగినందుకు బస్సు డ్రైవర్ పై దాడి చేసి తలపగలుకొట్టిన ఘటనకు నిరసనగా ఖమ్మం కొత్త బస్టాండ్ ఎదురుగా హైరాయ్ బస్ డ్రైవర్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాదె లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయులు మాట్లాడుతూ గతంలో కూడా సాయి అనే బస్సు డ్రైవర్ పై దాడి జరిగిందని, ఆ సమయంలో అధికారులు సర్దిచెబితే ఊరుకున్నారన్నారు. కానీ సోమవారం జరిగిన దాడి చాలా దారుణమైనదని వారు అభిప్రాయపడ్డారు. బస్టాండ్ ఆవరణంలోకి పది పదిహేను మంది దుండగులు ప్రవేశించి పోలీసులు ఎదుటే బానోతు వీరన్న అనే బస్ డ్రైవర్లను ఇష్టం వచ్చినట్లుగా కర్రలతో కొట్టిన తల పగిలి రక్తం వస్తున్న ఎవరు ఆపకపోవడం విచారకరమన్నారు. ఆర్టీసీ అధికారులు హైయర్ డ్రైవర్ల పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. గతంలో వారి సమస్యల పరిష్కరించాలని డిపో మేనేజర్ కు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోకపోవడం ఏమిటని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో హైయర్ బస్ డ్రైవర్లకు అండగా ఏఐటీయూసీ ఉంటుందని వారి ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో హైయర్ బస్ డ్రైవర్లు దిలీప్, రామకృష్ణ, వేణు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.