- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎమ్మెల్యే వీరయ్య దిష్టిబొమ్మ దహనం

దిశ, భద్రాచలం : భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆదేశానుసారం భద్రాచలం బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో నిరసన తెలియజేశారు. పొదెం వీరయ్య దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కి, ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల అధ్యక్షులు అరికెళ్ల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి ,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోధ బోయిన బుచ్చయ్య ,నాయకులు నక్కా ప్రసాద్, ఉపాధ్యక్షులు చింతాడి చిట్టిబాబు, అధికార ప్రతినిధి మల్లా రాంబాబు, గ్రంథాలయం చైర్మన్ మామిడి పుల్లారావు, కనకదుర్గ అమ్మవారి చైర్మన్ చింతాడు రామకృష్ణ, దిశ కమిటీ సభ్యులు లకావత్ వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ అధ్యక్షులు అంబటికార కృష్ణ, కొప్పుల శ్రీను, సీనియర్ మహిళా నాయకులు వీర్ల భారతి, ఎక్స్ ఎంపీటీసీ మానే కమల, సత్యవేణి, పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు.