- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట బురిడీ

దిశ, సత్తుపల్లి : పేద, మధ్యతరగతి నిరుద్యోగ యువతని ఆసరాగా చేసుకుని సత్తుపల్లి జేవీఆర్ ఓసి సింగరేణి సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న కొత్తగూడెం మండలం రుద్రంపూర్ కు చెందిన శరత్ చంద్ర, హరీష్, శేఖర్ అనే వ్యక్తులు సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట నిలువునా ముంచారు. సత్తుపల్లి మండల పరిధిలోని తాళ్లమడ, గంగారం, పెనుబల్లి మండల పరిధిలోని కొండ్రుపాడు, లింగగూడెం, పెనుబల్లి, మధిర మండలానికి చెందిన ఐదుగురు వ్యక్తుల వద్ద, ఖమ్మం పరిసర ప్రాంతాలలో నిరుద్యోగ యువతీ యువకులు సుమారు 100 మంది వద్ద నుంచి కోటిన్నర రూపాయలకు పైగా వసూలు చేశారు.
కొంతకాలంగా శరత్ చంద్ర, హరీష్, శేఖర్ అనే వ్యక్తులు బాధితులు వద్ద డబ్బులు వసూలు చేసి ఉద్యోగాల నియామకానికి సంబంధించిన పత్రాలు మంజూరు చేస్తామని మూడు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. అనుమానం వచ్చిన బాధితులు పథకం ప్రకారం శరత్ చంద్ర ,హరీష్ కు ఫోన్ చేసి నలుగురు ఉన్నారని, వారికి ఉద్యోగాలు కావాలి అని చెప్పారు. దాంతో వారి వద్దకు తన సూపర్వైజర్ అయిన హరీష్ ను పంపించారు. ఆయన్ని సుమారు 50 మంది బాధితులు నిలదీసి పోలీస్ లకు అప్పగించారు.
నిందితులపై స్థానిక పట్టణ సీఐ కరుణాకర్ కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ సత్తుపల్లి సింగరేణి లో ఉద్యోగాల పేరట మోసపోయిన యువతీ యువకులు వారి వారి స్థానిక పోలీస్ స్టేషన్ లో లేదా సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి 15 మంది ఫిర్యాదు చేశారని, వారి వద్ద నుంచి ఏడు లక్షల 76 వేలు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.