- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎమ్మెల్యేను విమర్శిస్తే చూస్తూ ఊరుకోం: సతీష్ హెచ్చరిక

దిశ, జూలూరుపాడు: జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు పొన్నెకంటి సతీష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇచ్చిన పదవులు అనుభవించి చివరకు పార్టీకి, ఎమ్మెల్యేకి వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుడిని కానీ, ఎమ్మెల్యేను కానీ విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఏ పార్టీకిలోకి వెళ్ళాలో అర్థం కానీ పరిస్థితిలో పొంగులేటి ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ధన రాజకీయాలు మానుకోవాలని, ఎమ్మెల్యే ఇచ్చిన ఎంగిలి పదవులను అనుభవిస్తున్నారని.. దమ్ముంటే రాజీనామా చేయాలంటూ ఆయన మండల నాయకులకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉన్నారని, ఆత్మీయ సమ్మేళనాలకు మండలం నుంచి ఎవరు వెళ్లరని ఆయన తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కళావతి, ఎంపీపీ సోనీ, నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ గాదె నిర్మల, సర్పంచులు రోజా, సావిత్రి, నాగేశ్వరరావు, గోడ వెంకటేశ్వర్లు, నరసింహారావు, మైబు తదితరులు పాల్గొన్నారు.