- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పేదరిక నిర్మూలనే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే సండ్ర

దిశ, సత్తుపల్లి : నిరుపేదలను ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు పరుస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గంలో 145 మంది లబ్ధిదారులకు మంజూరైన 75 లక్షల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఆదుకున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పై విమర్శించేవారు గత ప్రభుత్వాలలో ఎందుకు అందించలేకపోయారో చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నాలుగేళ్ల కాలంలో 4612 మంది లబ్ధిదారులకు 25 కోట్ల 66 లక్షల రూపాయలు సత్తుపల్లి నియోజకవర్గంలో సహాయం అందించినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మోనార్క రఫీ, మల్లూరు అంకం రాజు,
వార్డ్ కౌన్సిలర్లు అద్దంకి అనిల్, చాంద్ బాషా, తడికమల్ల ప్రకాశరావు, మట్టా ప్రసాద్, గ్రాండ్ మౌలాలి, కల్లూరు జెడ్పీటీసీ సభ్యులు కట్టా అజయ్ బాబు, పెనుబల్లి ఎంపీపీ లక్కినేని వినీల అలేఖ్య, బోబోలు లక్ష్మణరావు, తల్లాడ టీఆర్ఎస్ అధ్యక్షులు రెడ్డి వీర మోహన్ రెడ్డి, కుర్నవల్లి సొసైటీ అధ్యక్షులు ఐలూరి ప్రదీప్ రెడ్డి, సత్తుపల్లి జెడ్పీటీసీ కూసం పూడి రామారావు, పలువురు టీఆర్ఎస్ నాయకులు, వివిధ మండలాల సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.