- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాము కాటుతో బాలుడు మృతి

దిశ,టేకులపల్లి : పాము కాటు వేయడంతో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం టేకులపల్లి మండలం తడికలపూడి గ్రామానికి చెందిన కల్తీ బుచ్చి కోటయ్య, ముత్తమ్మ దంపతుల రెండో కుమారుడైన కల్తీ భరత్ (15) అనే బాలుడు పాల్వంచ గురుకులం పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రెండు రోజులు హాలిడేస్ రావడంతో సొంత ఊరైన తడికలపూడి వచ్చి ఉన్నాడు. సోమవారం రాత్రి వారి ఇంటి వద్ద కింద పడుకోవడంతో రాత్రి సమయంలో కట్లపాము కాటు వేసింది.
తెల్లవారుజామున తల్లిదండ్రులు పామును చూసి చంపేశారు. పామును చంపాక భరత్ ను లేపగా అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న భరత్ ను స్థానికుల సహాయంతో 108 వాహనం సహాయంతో సులానగర్ పీహెచ్సీకి తీసుకొచ్చారు. మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భరత్ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తల్లి తడికలపూడిలో ఆశ కార్యకర్తగా పనిచేస్తున్నారు. నిరుపేదలు కావడం వల్ల రేకుల ఇంట్లో నేలపై పండుకోవడం వలన పాము కాటుకు గురై బాలుడు మృతి చెందడంతో తడికలపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.