రైలు పట్టాలపై యువకుడి మృతదేహం గుర్తింపు

by srinivas |
రైలు పట్టాలపై యువకుడి మృతదేహం గుర్తింపు
X

దిశ , ఖమ్మం అర్బన్ : ఖమ్మం పట్టణంలోని దానవాయిగూడెం వద్ద రైలు పట్టాలపై ఒక యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని స్థానిక రంగనాయకులగుట్ట కు చెందిన సత్య ప్రసాద్ (27) అవివాహితుడిగా గుర్తించారు . నిన్న రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు . సంబంధిత మృత దేహాన్ని ఖమ్మం పట్టణానికి చెందిన అన్నం సేవా ఫౌండేషన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .



Next Story

Most Viewed