- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బీఆర్ఎస్ అరాచక పాలనకు త్వరలోనే ముగింపు..

దిశ, ఖమ్మం రూరల్: బీఆర్ఎస్ అరాచక పాలనకు ముగింపు పలికే శక్తి బీజేపీ కి మాత్రమే ఉన్నదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఏదులాపురం లో ఆయన క్యాంపు కార్యాలయంలో గూడూరు పాడు గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాలు శ్రీధర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీ మండలాధ్యక్షులు బట్టు నాగరాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్కు చెందిన సుమారు 20 కుటుంబాలు బీజేపీలో చేరారు. వీరందరికీ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులైన ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల నుంచి బీజేపీలో పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు.
అవినీతి కుటుంబ పాలనకు చరమగీతం పాడే సత్తా బీజేపీకే ఉన్నదని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, తిరుమలాయపాలెం మండలాధ్యక్షులు ప్రసాద్, రూరల్ బీజేవైఎం మండలాధ్యక్షులు బోడ ప్రకాష్, కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు విశ్వనాథం, ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులు సత్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.