- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ : తమ్మినేని

దిశ, వైరా : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల ఫలితంగా వ్యవసాయ రంగం దివాలా తీస్తుందని, రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాడి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. డిసెంబర్ 29న ఖమ్మంలో జరుగుతున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని వైరా మండలం గొల్లెనపాడు, గన్నవరం గ్రామాలలో తమ్మినేని వీరభద్రం పర్యటించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దేశానికి కేరళ తరహా విధానాలు అవసరమని తెలిపారు. దేశంలో ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం తీరును వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడటానికి కలిసి వచ్చే శక్తులతో భవిష్యత్తు పోరాటాలు నిర్వహిస్తామని, రైతులు, కూలీలు అందరూ కమ్యూనిస్టుల పోరాటాలను బలపరచాలని కోరారు. ప్రజా అనుకూలంగా పరిపాలన అందిస్తున్న కేరళ ముఖ్యమంత్రి పేనరాయి విజయన్ 29న బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా తరలి రావాలని కోరారు. ఈ సభలకు గొల్లెనపాడు, గన్నవరం గ్రామాల శాఖల కార్యదర్శులు అమరనేని వెంకటేశ్వరరావు, శీలం వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం, బొంతు రాంబాబు జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, వైరా విశాల సహకార పరపతి సంఘం వైస్ చైర్మన్ కొణిదన కోటేశ్వరరావు, గన్నవరం సర్పంచ్ వేమిరెడ్డి విజయలక్ష్మి, అష్టగుర్తి ఎంపీటీసీ కిలారు లక్ష్మి, సీనియర్ నాయకులు నల్లమోతు వెంకటనారాయణ, మండల కార్యదర్శివర్గ సభ్యులు కిలారు శ్రీనివాసరావు, మాగంటి తిరుమలరావు, బాజోజు రమణ, మండల కమిటీ సభ్యులు షేక్ షైనాబి, షేక్ అబ్దుల్ మజీద్, అష్ణగుర్తి శాఖా కార్యదర్శి చిత్తారు నాగరాజు, కారుమంచి జయరావు, కొణిదన ధర్మారావు, వెంపటి రాజా, అమరనేని అప్పారావు, అమరనేని రాము, నల్లమోతు రాజబాబు, కంచర్ల శ్రీను, సండ్రా వెంకటరావు, కొణిదన రాజేంద్రప్రసాద్, కారుమంచి మల్లయ్య, చిత్తారు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.