- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మత ఘర్షణలు సృష్టిస్తున్న బీజేపీ

దిశ, కూసుమంచి : దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా బీజేపీ నాయకులు లబ్ధి పొందాలని మత ఘర్షణ సృష్టిస్తారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందేందుకే మణిపూర్ రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి ప్రయోగం చేసిందని, ఈ మత ఘర్షణ ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా ప్రయోగించాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని,
అలా జరిగితే దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని, రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సినియర్ నాయకులు శీలం గురుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు జబ్బర్, మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, మండల కమిటీ సభ్యులు మల్లెల సన్మతరావు, తోటకూరి రాజు, మూడు గన్యా నాయక్, జువాజి శ్రీను, చీర్ల రాధాకృష్ణ, కర్ణబాబు, పందిరి వీరారెడ్డి, శీలం జానయ్య, కేవీపీఎస్ నాయకులు సత్యనారాయణ, పడిశాల శేషయ్య తదితరులు పాల్గొన్నారు.