తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : బండి సంజయ్ కుమార్

by Sridhar Babu |   ( Updated:2023-05-27 14:08:17.0  )
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : బండి సంజయ్ కుమార్
X

దిశ, ఖమ్మం సిటీ : తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలో బీజేపీ ఏర్పాటు చేసిన నిరుద్యోగ మార్చ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శనివారం జెడ్పీ సెంటర్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు జిల్లా అధ్యక్షుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వరంగల్ లో ప్రారంభమైన నిరుద్యోగ మార్చ్ పాలమూరు మీదుగా ఖమ్మంకు చేరుకుందన్నారు.

ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సభ వేదిక వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జెడ్పీ సెంటర్ వరకు పాదయాత్రగా బయలుదేరి ఖమ్మం పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Also Read..

తెలంగాణలో త్వరలోనే గులాబీ జెండా పని ఖతం: MP బండి సంజయ్

తిరగబడుతున్న జనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్!



Next Story

Most Viewed