- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బీజేపీ మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చి బోర్ల పడ్డది : వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి ఎద్దేవా

దిశ, వేంసూర్ : వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామంలో టీఎస్ ఆయిల్ ఫెడ్, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ స్థలాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఇటీవల అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించి పంట నష్టం కు సంబంధించిన నివేదికను వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యానవ పంటలపై రైతులు ఎక్కువ దృష్టి పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం పై ఆధార పడకుండా రాష్ట్రం రైతాంగానికి కావాల్సిన విధంగా అన్నివెసులుబాటులు కల్పించారన్నారు. పంట మార్పిడి విధానం వల్ల రైతుకు లాభాలు చేకూరుతాయని, ఆహార పరిశ్రమలు వస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక ఆహార పరిశ్రమలు పెట్టేవిధంగా ప్రభుత్వం ఆలోచనలో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని, మూడు చట్టాలు తెచ్చి చతికల పడ్డారని, రైతులను వాహనాలతో తొక్కించిన చరిత్ర బీజేపీదని అన్నారు. కల్లూరుగూడెం ఫామాయిల్ ఫ్యాక్టరి శంకుస్థాపనకు కేసీఆర్ కి ఆహ్వానం పంపుతాం అని అన్నారు.