- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని బీజేపీ ధర్నా..

దిశ, ఖమ్మం టౌన్ : జిల్లాలో ఇండ్లులేని నిరుపేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వాన్ని నిరసిస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు తమిళనాడు సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చాక ప్రజాసమస్యలను గాలికి వదిలి అక్రమ సంపాదన మీద పడ్డారని ఆరోపించారు. ఇండ్లులేని పేదవారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి కేంద్రం ఇస్తున్న నిధులను బొక్కుతూ ప్రజలను మోసం చేస్తుందన్నారు.
ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా మళ్ళీ అధికారం కోసం కుట్రలు పన్నుతు కలలు కంటున్నారని, కలలు కళలుగానే మిగులుతాయని అన్నారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యల పై ద్రుష్టి పెట్టిందని ఇక కేసీఆర్ పని అయిపోయింది అని కేసీఆర్ ను ప్రజలు నమ్మె పరిస్థిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, గెంటేల విద్యాసార్, రవికుమార్, నంబూరి రామలింగేశ్వరావు, అరుణ, సరస్వతి, ఉపేందర్ గౌడ్, సుగుణ, అనిత, శంకర్ గౌడ్, వీరు గౌడ్, తదితరులు ఉన్నారు.