పాలేరు జవహర్ నవోదయ విద్యాలయాన్ని సందర్శించిన భట్టి విక్రమార్క

by Sridhar Babu |
పాలేరు జవహర్ నవోదయ విద్యాలయాన్ని  సందర్శించిన భట్టి విక్రమార్క
X

దిశ, కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం విద్యుదాఘాతంతో కొక్య తండా గ్రామానికి చెందిన దుర్గా నరేందర్ మృతి చెందగా, నలుగురు విద్యార్థులు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివారం జవహర్ నవోదయ విద్యాలయాన్ని సందర్శించారు. అనంతరం విద్యాలయంలో ఏర్పాటు చేసిన దుర్గా నరేందర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన అందుకు గల కారణాలను హైదరాబాద్ నవోదయ రీజినల్ అసిస్టెంట్ కమిషనర్ అభిజిత్ బేరా, ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగభూషణం లను

ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటన జరగటం చాలా దురదృష్టకరమన్నారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావద్దని అధికారులను కోరారు. ఆ కుటుంబంలో బాబు తండ్రికి విద్యాలయంలోనే ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన అనంతరం సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని అన్నారు. బట్టి వెంట టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మండల అధ్యక్షుడు మట్టి గురవయ్య , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హఫీజుద్దీన్, దాసరి వెంకన్న, మంకెన వాసు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.



Next Story