- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పల్లె చెంతకు మెరుగైన వైద్య సేవలు

దిశ,కామేపల్లి : గ్రామీణులకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె దవాఖానాలకు శ్రీకారం చుట్టిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు వైద్యాధికారి డాక్టర్ బి. రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం కామేపల్లి మండలంలోని గోవింద్రాల, బర్లగూడెం పొన్నెకల్లు పల్లె దవాఖానాలను ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె దవాఖానాల ఏర్పాటుతో ప్రజల చెంతకే వైద్యం చేరుతుందని అన్నారు.
పట్టణాలకు వెళ్లి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం లక్షలు ఖర్చు పెట్టే భారం ప్రజలకు తగ్గుతుందని తెలిపారు. ఉచితంగా వైద్య పరీక్షలు,మందులు పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి ప్రభుత్వ వైద్యశాల వైద్య అధికారి డాక్టర్ ఎన్. చందన, గోవింద్రాల, బర్లగూడెం పల్లె దవాఖానాల డాక్టర్లు డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, డాక్టర్ సుదీప్, పొన్నెకల్లు ఎం ఎల్ హెచ్ పీ బి.నాగమణి,హెచ్ఈవో బి.దూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.