మార్కెట్​ కమిటీ డైరెక్టర్​ సతీమణి భౌతికకాయానికి నివాళులర్పించిన బెల్లం వేణు

by Sathputhe Rajesh |
మార్కెట్​ కమిటీ డైరెక్టర్​ సతీమణి భౌతికకాయానికి నివాళులర్పించిన బెల్లం వేణు
X

దిశ, ఖమ్మం రూరల్​: రూరల్​ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన టీఆర్​ఎస్​ నాయకుడు మద్దులపల్లి మార్కెట్​ కమిటీ డైరెక్టర్​ చుంచు జానికిరాముల భార్య చుంచు సబిత సోమవారం సాయంత్రం ఆటోలో ఖమ్మం వెళ్తుండగా ఆటో డ్రైవర్​ సడన్​ బ్రేక్​ వేయడంతో ఆటోలో నుంచి కిందపడ్డ సబితకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సబితను చికిత్స నిమిత్తం హస్పిటల్​కు తరలించగా.. మంగళవారం మరణించింది. విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావులు ఫోన్ లో సంతాపం తెలిపారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్​ఎస్​ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, ఎంపీపీ బెల్లం ఉమ, వైఎస్​ ఎంపీపీ దరగయ్య, సుడా డైరెక్టర్​ గూడ సంజీవరెడ్డిలు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నివాళ్లర్పించినవారిలో బండి సతీష్​, బండి జయదేవ్​, కోండల్​, పావురాల వెంకన్న తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed