- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మార్కెట్ కమిటీ డైరెక్టర్ సతీమణి భౌతికకాయానికి నివాళులర్పించిన బెల్లం వేణు

దిశ, ఖమ్మం రూరల్: రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చుంచు జానికిరాముల భార్య చుంచు సబిత సోమవారం సాయంత్రం ఆటోలో ఖమ్మం వెళ్తుండగా ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటోలో నుంచి కిందపడ్డ సబితకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సబితను చికిత్స నిమిత్తం హస్పిటల్కు తరలించగా.. మంగళవారం మరణించింది. విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావులు ఫోన్ లో సంతాపం తెలిపారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, ఎంపీపీ బెల్లం ఉమ, వైఎస్ ఎంపీపీ దరగయ్య, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డిలు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నివాళ్లర్పించినవారిలో బండి సతీష్, బండి జయదేవ్, కోండల్, పావురాల వెంకన్న తదితరులు ఉన్నారు.