ఇల్లందులో గ్రామపంచాయతీ కార్మికుల భిక్షాటన..

by Sumithra |
ఇల్లందులో గ్రామపంచాయతీ కార్మికుల భిక్షాటన..
X

దిశ, ఇల్లందు : గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్లను, బిల్ కలెక్టర్ ను సహయ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించాలని తదితర డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా 12 రోజుల నుండి జరుగుతున్న సమ్మెలో భాగంగా సోమవారం ఇల్లందు మండల గ్రామపంచాయతీ వర్కర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో భిక్షాటన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి, మండల జేఏసీ చైర్మన్ తొగర సామేలు, నాయకులు రామిశెట్టి నరసింహారావు, రామళ్ళ మోహన్ రావు గ్రామ పంచాయతీల వర్కర్స్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed