- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బీసీల్లోని అన్నికులాలకు తక్షణమే బీసీ బంధు అమలు చేయాలి

దిశ, ఖమ్మం టౌన్ : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీలను మరోసారి దగా చెయ్యడానికి కుట్రపన్నుతోందని, ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ శనివారం ఆ సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు టేకుమట్ల వీరుగౌడ్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి మయూరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, వీరుగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలను వేరు చేస్తూ,
బీసీల్లోని కొన్ని కులాలకు మాత్రమే లక్ష రూపాయల లోనును ఇవ్వడం బీసీలను అవమాన పరచడమే అన్నారు. రైతుబంధు, దళిత బంధు మాదిరిగా బీసీలలోని అన్నికులాలకు బీసీ బంధును తక్షణమే ప్రకటించాలని, లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతు జ్వాలా నరసింహరావు, రుద్ర ప్రదీప్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు రేఖా సత్యనారాయణ, వేముల వెంకట్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రుద్రగాని మాధవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, సీనియర్ నాయకులు శీలం పాపారావు, జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సుధాకర్, బోయినపల్లి శేఖర్, మందా సరస్వతి, రవి రాథోడ్, ఆనంతు ఉపేందర్, యల్లారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.