రూ.పది లక్షల కు దివాళా పిటిషన్ దాఖలు

by Sridhar Babu |
రూ.పది లక్షల కు దివాళా పిటిషన్ దాఖలు
X

దిశ, లీగల్ ఖమ్మం : ఖమ్మం పట్టణం శ్రీనివాస్ నగర్ కు చెందిన నూకల కిరణ్ కుమార్ 16 మందిని ప్రతివాదులుగా చూపిస్తూ మొత్తం రూ.10 లక్షల 25 వేలకు దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. దివాళా దారుడు హైదరాబాద్ లో హోటల్ వ్యాపారం చేశాడు. కరోనా కాలంలో హోటల్ వ్యాపారం జరగక నష్టాలు రావడంతో తిరిగి ఖమ్మం పట్టణం కు వచ్చాడు. ఈ హోటల్ వ్యాపారాన్ని హైదరాబాద్ లో అభివృద్ధి చేయడం కోసం బంధువుల దగ్గర , స్నేహితులు దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. ఈ వ్యాపారంలో నష్టం రావడంతో రుణదాతల నుండి ఒత్తిడి అధికమవడంతో గత్యంతరం లేని పరిస్థితి లో 16 మందిని ప్రతివాదులుగా చూపిస్తూ ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు లో తన న్యాయవాది కూన చంద్రశేఖర్ గుప్తా ద్వారా దివాళా పిటిషన్ దాఖలు చేశాడు.



Next Story

Most Viewed