ఘనంగా బాలాజీ వేంకటేశ్వరుడి కళ్యాణోత్సవం

by Shiva |   ( Updated:2023-02-02 13:24:19.0  )
ఘనంగా బాలాజీ వేంకటేశ్వరుడి కళ్యాణోత్సవం
X

దిశా, అన్నపురెడ్డిపల్లి: మండల కేంద్రంలోని శ్రీ సద్గురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ సత్సంగం 21 వ వార్షికోత్సవం సందర్భంగా బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సద్గురు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం సంతోషదాయమని తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లావణ్య భరత్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బోయినపల్లి సుధాకర రావు, పర్సా వెంకట్, వైస్ ఎంపీపీ రామారావు, సర్పంచ్ బొడ పద్మ, జంగాల ఉమామహేశ్వరరావు, లక్ష్మణ్ రావు, విరబొయిన వెంకటేశ్వర్లు, అమర్నాథ్, రాంబాబు, బుపతి నరసింహరావు, కొత్తూరు వెంకటేశ్వరరావు, వేణు, చల్లా లక్ష్మణ్ రావు, చల్లా శ్రీనివాస్ రావు, బోలికొంద సత్యనారయణ, బొడుగు ముత్తయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed