గ్రామీణ వైద్యులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు

by Sumithra |
గ్రామీణ వైద్యులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు
X

దిశ, టేకులపల్లి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశానుసారం ఈరోజు టేకులపల్లి మండలంలోని గ్రామీణ వైద్యులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే వైద్యం చేయాలని స్థాయికి మించి వైద్యం చేయరాదని అనవసరంగా యాంటీబయాటిక్ ఇంజక్షన్లు స్టెరాయిడ్స్ వాడటం వల్ల దీర్ఘకాలికంలో ఆ సమాజంలోని ప్రజలు ఎన్నో రుగ్మతలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

జ్వర పీడితులను రక్తపోటు షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించినట్లయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని గ్రామీణ వైద్యులు కూడా తమ బాధ్యతగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకత గురించి సీజనల్ వ్యాధుల పై కూడా అవగాహన కల్పించాలని తమ వద్దకు జ్వరంతో వచ్చిన వారి వివరాలు ఒక రిజిస్టర్ లో నమోదు చేసుకొని ఎప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెలపాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల తరఫున గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు నటరాజ్ మాట్లాడుతూ మా పరిధిలోనే ప్రధమ చికిత్సలు అందిస్తామని వైద్యాధికారికి తెలిపారు. ఈ సమావేశంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ, సూపర్వైజర్లు ఫోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు, గుజ్జ విజయ, వీసంశకుంతల, గ్రామీణ వైద్యులు నటరాజ్, ఖాదర్ బాబు, ఉత్తరయ్య, యాకూబ్ పాషా, వెంకటేశ్వర్లు రాజు, అన్వేష్, రామ్మోహన్, శ్రీరాములు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed