- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సురక్షితమైన నీటిపై అవగాహన అవసరం

దిశ,ఇల్లందు : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉత్సవాలను పురస్కరించుకొని ఇల్లందు ఏరియా జీఎం కార్యాలయంలో 122 వ వారం కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రమైన , సురక్షితమైన నీటిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుభ్రమైన, సురక్షితమైన నీరు తాగడం వలన ఎటువంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ప్రతి మనిషి రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని, కాచి వడబోసి చల్లార్చిన నీరు తాగాలని అన్నారు.
కావున ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని తాగి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అంతేకాకుండా సింగరేణి సంస్థ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసమే కాకుండా పరిసర ప్రాంత ప్రజల కోసం కూడా శుభ్రమైన తాగునీరు అందించడం కోసం ఆరు ఆర్ఓ తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. తదుపరి ఉద్యోగులలో మరింత అవగాహన పెంపొందించడం కొరకు తాగునీటిపై ప్రచురించిన కరపత్రాలను ఆవిష్కరించి ఉద్యోగులందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో యస్వోటు జీఎం మల్లారపు మల్లయ్య, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పి.శ్రీనివాసు, డిజియం (పర్సనల్) జీవి మోహన్ రావు, ఏరియా ఇంజనీర్ ప్రభాకర్ రావు, ఎస్.ఇ (సివిల్)రవి కుమార్, డి.వై.పి.యం. శ్రీహరి, పిట్ కార్యదర్శి యాదగిరి ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.