- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రగతి భవన్కు పయనమైన గ్రామస్తులు.. పోలీస్టేషన్లో మహిళా సర్పంచ్.. ఇది MLA పనేనా ?

దిశ, అశ్వారావుపేట: గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ, భూ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్తులు ప్రారంభించిన ప్రగతి భవన్ పాదయాత్రను పోలీసులు బలగాలు భగ్నం చేశాయి. సోమవారం ఉదయం ఏడు గంటలకు రామన్నగూడెంలో ప్రగతి భవన్ పాదయాత్రను ప్రారంభించారు. దీంతో గంగారం గ్రామ సమీపంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. జై కేసీఆర్ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రగా చేస్తున్న గ్రామస్తులను గంగారం వద్ద పోలీసులు అడ్డుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామ సమస్యలను పరిష్కరించుకోవాలని పాదయాత్రను విరమించుకోవాలని కోరారు. ఇందుకు గ్రామస్తులు నిరాకరించడంతో వారిని పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న గ్రామస్తులను పోలీసులు బలవంతంగా రెండు వ్యాన్ లలో ఎక్కించి కొందరిని ములకలపల్లికి మరికొందరిని కిన్నెరసాని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో కూడా జై కేసీఆర్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేయడం గమనార్హం. పోలీసులు అదుపులోకి తీసుకొని తరలించిన వారిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప, మడకం నాగేశ్వరరావు దంపతులు ఉన్నారు. వీరే ప్రగతి భవన్ పాదయాత్రకు సారథ్యం వహిస్తుండగా.. ఏడాదిన్నర వయసు గల పాపతో సర్పంచ్ మడకం స్వరూపను వ్యాన్లోకి ఎక్కించి తరలించారు. సాధారణంగా వామపక్షాలకు చెందిన నేతలు కార్యకర్తలు ఇటువంటి పాదయాత్రలకు చేపడుతుంటారు. వారిని ఈ విధంగా అరెస్టులు చేస్తుంటారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే అధికార పార్టీకి చెందిన సర్పంచ్ దంపతులు గ్రామ సమస్యలు స్థానికంగా పరిష్కరించేవారు లేరంటూ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటాం అని పాదయాత్ర చేపట్టడం చర్చనీయంగా మారింది.
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రాజీనామా చేయాలి
తమ గ్రామ సమస్యలను పరిష్కరించుకునేందుకు చేపట్టిన ప్రగతి భవన్ పాదయాత్రను విరమించుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చెప్పిన మాట విననందుకే.. శాంతియుతంగా పాదయాత్రకు వెళ్తున్న గ్రామస్తులపై పోలీసులను ఉసిగొల్పి అక్రమ అరెస్టులకు కారణమయ్యారని. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తోపాటు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి అమాయక గిరిజనుల అక్రమ అరెస్టులకు నైతిక బాధ్యత వహిస్తూ వారి పదవులకు వెంటనే రాజీనామా చేయాలని పాదయాత్రకు సారథ్యం వహిస్తున్న మడకం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అక్రమంగా నిర్బంధించిన వారిని విడుదల చేయాలని.. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రాజీనామా చేయని పక్షంలో ఆదివాసి గూడెం లకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏడాదిన్నర పసిపాపకు తల్లి అయిన సర్పంచ్ మడకం స్వరూప ను అర్ధరాత్రి దౌర్జన్యంగా అరెస్టు చేయడం.. చంటి బిడ్డతో బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం చూస్తుంటే రామన్నగూడెం పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేక పాకిస్తాన్ లో ఉందా అనేదానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని.. పోలీసుల అదుపులో ఉన్న మడకం నాగేశ్వరరావు వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రశ్నించారు.