- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నా.. ఎమ్మెల్యే మెచ్చా

దిశ, అశ్వారావుపేట: నియోజకవర్గ అభివృధ్ధే తన లక్ష్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం అశ్వారావుపేట ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్, ఎన్సీడీ క్లినిక్, పేషెంట్ వెయిటింగ్ హాల్ లను డీసీహెచ్ఎస్ రవిబాబుతో కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ.. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని సీహెచ్సీలో 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆధునిక వైద్య పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. తన మాటను మన్నించి సీహెచ్సీకి వైద్య సదుపాయాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే వంద పడకల సదుపాయం కూడా వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం డీసీహెచ్ఎస్ రవిబాబు మాట్లాడుతూ.. అశ్వారావుపేట సీహెచ్సీలో ఇన్ని వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామంటే అది ఎమ్మెల్యే మెచ్చా చొరవతోనేనని తెలిపారు. ఇకపై 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ లు చిన్నంశెట్టి వరలక్ష్మి, పైడి వెంకటేశ్వరరావు, సర్పంచ్ లు సుమతి, జ్యోత్స్న, నారం రాజశేఖర్, సొసైటీ చైర్మన్ సత్యనారయణ, నిర్మల పుల్లారావు, మందపాటి మోహన్ రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావు, సంపూర్ణ, కలపాల శ్రీను, మోహన్, హారి, జిన్నా, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు.