జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు

by S Gopi |
జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు
X

దిశ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఈనెల 10వ తేదీ నుండి జరిగే జాతీయ స్థాయి గ్రామీణ క్రీడలకు అథ్లెటిక్స్ విభాగంలో ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన రంజిత్ కుమార్ అండర్-16 విభాగంలో, సంతోష్ అండర్ 14 అథ్లెటిక్స్ విభాగంలో ఎన్నికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ బొల్లి గోపాలరావు తెలిపారు. జాతీయ స్థాయిలో ఎన్నికైన విద్యార్థులను ఏటీడీవో చంద్రమోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మ, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ సాగర్ అభినందించారు.



Next Story