- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ అనుదీప్

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: దేశ ప్రథమ మహిళ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు ఏర్పాట్లు ఘనంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఈ నెల 28వ తేదీన భారత రాష్ట్రపతి భద్రాచలం పర్యటన పురస్కరించుకుని విధులు కేటాయించిన జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు ఈ నెల 26వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హెలిపాడ్లు ఏర్పాటు ప్రక్రియ గురించి ఆర్అండ్బీఈఈ భీంలాను అడిగి తెలుసుకున్నారు. పటిష్టమైన, కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని తెలిపారు. మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభోత్సవాలు వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రపతి నిర్వహించనున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్ఐసీ సిబ్బందిని ఆదేశించారు. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా 26వ తేది వరకు కేటాయించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అధికారులు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రపతి పర్యటించు ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించి, పట్టణాన్ని పరిశుభ్రంగా తయారు చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. అధికారులకు కేటాయించిన విధులను సకాలంలో పూర్తి చేయుటకు ముందస్తుగా పర్యటించాలని, ఏర్పాట్లపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. దేవాలయం వద్ద క్రిటికల్ కేర్ బాక్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య నిపుణులను అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రత్యేక వార్డులు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. అంతర్జాల సేవలు అందుబాటులో ఉంచాలని బీఎస్ఎన్ఎల్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నయంగా జనరేటర్ సిద్ధంగా ఉండాలని విద్యుత్ అధికారులకు సూచించారు.