- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి

దిశ, భద్రాచలం : గత ఏడాది గోదావరి వరదలు కారణంగా ముంపు నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన గోదావరి వరదలపై ముందస్తు చర్యలలో భాగంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గోదావరి వరద 50 అడుగులకు మించి వచ్చినప్పుడు పట్టణంలోని వరద నీరు గోదావరిలోకి వెళ్లకపోవడం కారణంగా ఎక్కువ ముంపు నష్టం జరుగుతుందని,
వరద నీటిని గోదావరిలోకి పంప్ చేయడానికి అత్యధిక సామర్థ్యం కలిగిన మోటార్లను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. వరద భాధితులకోసం పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అన్నారు. భద్రాచలం, కొత్తగూడెం కేంద్రంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి అధికారులకు, ప్రజలకు తగు సమాచారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ డి ఓ రత్న కళ్యాణి, ఏ ఎస్ పీ పరితోష్ పంకజ్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.