హట్రిక్.. ఎమ్మెల్యే సండ్రకు మరో అవకాశం

by Sumithra |
హట్రిక్.. ఎమ్మెల్యే సండ్రకు మరో అవకాశం
X

దిశ, సత్తుపల్లి : త్వరలో జరగనున్న ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ నేడు ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా 2009 సార్వత్రిక ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వేషన్ కావడంతో 2009లో టీడీపీ అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య పోటీలో ఉండగా సండ్ర వెంకటవీరయ్యకు 79,491, ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటి చేసిన అభ్యర్థి సంభానీ చంద్రశేఖర్ కు 65,483, ఓట్లు రాగా సంభానీ చంద్రశేఖర్ పై 14,008 ఓట్లు మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి సండ్ర వెంకట వీరయ్యకు 75,490, ఓట్లు రాగా సమీప అభ్యర్థి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ కు 73,005 ఓట్లు రాగా, డాక్టర్ మట్టా దయానంద్ పై 2485 ఓట్ల మెజార్టీతో 2014 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా టీడీపీ నుంచి పోటీ చేసిన సండ్ర వెంకట వీరయ్యకు 100.044 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన పిడమర్తి రవి కి 81,042 ఓట్లు రావడంతో టిడిపి పార్టీ నుంచి పోటీ చేసిన సండ్ర వెంకట వీరయ్యకు 19,002 ఓట్ల మెజార్టీతో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీడీపీ పార్టీ నుంచి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సండ్ర వెంకట వీరయ్య పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సండ్ర వెంకట వీరయ్య అభిమానులు పెద్ద ఎత్తున తపాసులు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు.



Next Story