- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అకాల వర్షంతో అన్నదాత ఆగం

దిశ, వైరా : అకాలంగా వచ్చిన వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. ఆరుగాలం కష్టించి పంటలను సాగు చేస్తున్న రైతులకు అకాల వర్షం పిడుగుపాటుగా మారింది. ఈ వర్షంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటలు అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నాయి. వైరా, కొణిజర్ల మండలాల్లో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కన్నీటి వ్యథనే మిగిల్చింది. భారీ ఈదరు గాలులతో కురిసిన అకాల వర్షానికి వైరా కొణిజర్ల మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంట నేల కూలింది. కంకి వేసిన మొక్కజొన్న పంట నేల కూలటంతో రైతులు కన్నీటి పర్యంతులవుతున్నారు.
మరోవైపు కల్లాల్లోని మిర్చి వర్షానికి తడిచింది. ప్రధానంగా వైరా, కొణి జర్ల మండలాల్లో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట నేల కూలింది. మండలంలోని తాటిపూడి, లింగన్నపాలెం, జింకలగూడెం. రెబ్బవరం, పాలడుగు, వల్లపురం, గరికపాడు, లింగన్నపాలెం, విప్పలమడక, తాటిపూడి గ్రామాలతో పాటు కొణి జర్ల మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న నేలమట్టమైంది. అంతేకాకుండా దాచాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ వేల్పుల శౌరి ఇంటి వద్ద ట్రాక్టర్, రేకుల షెడ్డు పై భారీ వృక్షం పడి రేకుల షెడ్ కూలిపోయింది. మొక్కజొన్న కంకుల దశలో ఉన్న సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పంట మొత్తం నేలకు ఒరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని పరిహారం చెల్లించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.