- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

దిశ, ఇల్లందు: అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఇల్లందు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నేత అబ్దుల్ నబీ పాల్గొని మాట్లాడుతూ 2018 అక్టోబర్ లో కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ. 1500, మినీ టీచర్లకు రూ. 1250, హెల్పర్లకు రూ. 750 రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్ తో సహా చెల్లించాలని, 2017 నుండి టీఏ డీఏ బకాయిలు మొత్తం చెల్లించాలి.. దీనికి సరిపడా బడ్జెట్ ను విడుదల చేయాలన్నారు. పీఆర్సీ ఏరియర్స్ బకాయిలు చెల్లించి, ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా వేతనం, పెన్షన్, హెల్త్ కార్డులు, ఈఎస్ఐ వేతనంతో కూడిన వేసవి సెలవులు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రమాద బీమా కల్పించాలి.. ఎన్ హెచ్ టీ ఎస్ యాప్ ను రద్దు చేయాలని, జీఓ నెం. 14, 19, 8లను వెంటనే సవరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశామని.. ఫిబ్రవరి నెలలో చలో అసెంబ్లీకి పిలుపు ఉన్నదని.. ఈ లోపు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తాళ్లూరి కృష్ణ, కే మరియా, ఫాతిమా, మన్యం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.