ప్రాణం తీసిన కొవ్వొత్తి.. ఎలా జరిగిందంటే?

by Manoj |
ప్రాణం తీసిన కొవ్వొత్తి.. ఎలా జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి మంటల్లో కాలిపోయిన ఓ వృద్ధుడు మృతి చెందాడు . వివరాల్లోకి వెళితే.. ఆదివారం భారీ వర్షం కారణంగా అశ్వారావుపేటలోని కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఓ వృద్ధుడు గుడిసెలో చీకటిగా ఉందని కొవ్వొత్తి వెలిగించి నిద్రిస్తుండగా మధ్యరాత్రి కొవ్వొత్తి మంట కాస్త పెద్దగా మండి పక్కన ఉన్న బట్టలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి బయట పడలేక మంటల్లోనే చిక్కుకొని వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. ప్రమాదం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed