- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ దందా..

దిశ, ఖమ్మం : ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ల దందా విచ్ఛలవిడిగా కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరుపేద ప్రజలు వైద్యానికి వచ్చినప్పుడు మెరుగైన సౌకర్యాల కోసం దూరప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వఆసుపత్రిలో ఉన్న అంబులెన్స్ కావాలంటే డబ్బులు సమర్పించుకోవాల్సిందే. కరోనా సమయంలో రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు రాష్ట్రపురపాలక శాఖమంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాప్రతినిధులు వారి సొంత నిధుల నుంచి ఆధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్లను ప్రభుత్వ ఆసుపత్రులకు అందించారు. కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో నడిచాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవల కంటే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్న సమయంలో అక్కడఉన్న సిబ్బంది ఇదే అదునుగా భావించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఉన్నఅంబులెన్స్లు పేదలకు ఉచితంగా పంపించాలని జీవో ఉన్నప్పటికీ అక్కడ ఉన్న వైద్యాధికారులు సిబ్బందితో చేతులు కలిపి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
దూరాన్ని బట్టి డబ్బులు డిమాండ్..
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అంబులెన్స్ లు నిరుపేద రోగులకు ఉపయోగంలో రావాడం లేదు. రోగి మెరుగైన చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే అంబులెన్స్లకు డబ్బులు ఇవ్వాల్సిందే. హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే వేళల్లో వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అంబులెన్స్ లకి డీజిల్ ఉచితంగా అందిస్తున్న అక్కడ ఉన్న సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. రికార్డులో మాత్రం ఉచితంగా తరలించామని నమోదు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్స్ లో జరుగుతున్న వసూల్ దందా పై ఆసుపత్రిలో వైద్య అధికారులు మౌనంగా ఉన్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చేస్తున్ వసూళ్ల పర్వం వారి దృష్టి వచ్చిన చూసి చూడనట్టు వ్యవహరించడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి అంబులెన్స్ దందాకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.