'అలయ్-బలయ్ ను జయప్రదం చేయాలి'

by samatah |
అలయ్-బలయ్ ను జయప్రదం చేయాలి
X

దిశ,మణుగూరు/అశ్వాపురం: హైదరాబాద్‌ లోని ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ హోమ్‌లో మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ డా.పిడమర్తి రవి నాయకత్వంలో జరిగే మాదిగల అలయ్-బలయ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని మల్లెలమడుగు ఎస్సీ కాలనీలో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30న ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ హోమ్‌లో జరిగే మాదిగల అలయ్-బలయ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మాదిగలపై సమగ్ర సర్వే చేపట్టి మాదిగలకు 12శాతం రిజర్వేషన్లు,మంత్రి వర్గంలో చోటు, టీఎస్పీఎస్సీలో మాదిగలకు సభ్యులుగా అవకాశం కల్పించాలని,ఎస్సీ/ఎస్టీ కమీషన్ చైర్మన్ పదవి మాదిగలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో ఒక యూనివర్సిటీ వీసీగా మాదిగలకు అవకాశం కల్పించాలన్నారు. రాబోయే 2023ఎన్నికల్లో ఏ పార్టీ అయిన సరే మాదిగలకు పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించే విధంగా పూనుకోవాలన్నారు. మాదిగ,మాల ఉప కులాల కార్పొరేషన్ ను విభజించాలని డిమాండ్స్ తోనే అలయ్-బలయ్ కార్యక్రమం జరుగుతుందని ఈసందర్బంగా తెలిపారు. ఈకార్యక్రమాన్ని మాదిగ జేఏసీ నాయకులు,కార్యకర్తలు,మేధావులు, విద్యార్థులు,పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు హాజరౌతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మందా హుస్సేన్, ఇసంపల్లి పున్నారావు,మచ్చ నరసింహారావు,గాడిద మహేష్,కిరణ్,సురేష్,ప్రశాంత్,కృష్ణ,ముత్తయ్య, వెంకటి,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed