కందుకూరు లో అఖండ ఎడ్లు

by Sridhar Babu |
కందుకూరు లో  అఖండ ఎడ్లు
X

దిశ, వేంసూర్ : కందుకూరు గ్రామంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు నిర్వహిస్తున్న వృషభ రాజుల బండ లాగుడు పోటీల్లో అఖండ సినిమాలో కనిపించిన ఎడ్లు దర్శనమిచ్చాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన పులగం త్రిషాజ్ఞారెడ్డి, జశ్వితరెడ్డిలకు చెందిన యోగానంద్, భైరవ అనే వృషభములను పోటీ కి తీసుకొచ్చారు. ఇవి అఖండ సినిమా లో బాలకృష్ణ తో పాటు నటించాయి. వీటి ప్రదర్శనను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



Next Story