ఎమ్మెల్యే సారు చేస్తానన్నా పనులు ఎక్కడ.. మాట నిలబెట్టుకోండి: ఏఐవైఎఫ్

by Dishanational4 |
ఎమ్మెల్యే సారు చేస్తానన్నా పనులు ఎక్కడ.. మాట నిలబెట్టుకోండి: ఏఐవైఎఫ్
X

దిశ, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో బస్ షెల్టర్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కానీ, ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదు. దీంతో జూలూరుపాడు మండల కేంద్రంలో బస్సు సెంటర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం వివిధ పనులపై మండల కేంద్రానికి రెవెన్యూ, బ్యాంకులు, పనుల నిమిత్తం వచ్చే మహిళలు పబ్లిక్ టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఏఐవైఎఫ్ నాయకులు అన్నారు.

ఈ విషయమై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పలుమార్లు దీక్షలు నిర్వహించామని, ఆ సమయంలో ఎమ్మెల్యే రాములు నాయక్, అధికారులు వచ్చి హామీ ఇచ్చారని తెలిపారు. కానీ, ఇప్పటి వరకు నెరవేర్చలేదని తహసీల్దార్ ఆఫీస్ ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగుల్ మేర చాంద్ పాషా, నాగరాజు, అఖిల్ నాయుడు, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story