- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మావోయిస్టులపై మరోసారి వైమానిక బాంబు దాడి..?

దిశ, చర్ల: భద్రతా బలగాలు మరోసారి వైమానిక బాంబు దాడి జరిగినట్లు మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ ఆరోపించారు. ఆ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. పామేడ్, కిస్టారం సరిహద్దు ప్రాంతాలైన సౌత్ బస్తర్, మద్కన్గూడ మెట్టగూడ, బొట్టెటాంగ్, సకిలేర్, మడ్పాడులాడే, కన్నెమార్క, పొట్టేమంగుం, బొత్తలంకలో వాయుసేన బాంబుదాడి జరిగిందని ఆరోపించారు.
తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులతో సమన్వయంతో హెలికాప్టర్ల ద్వారా గ్రామాలు, అటవీ కొండలు, రాసపల్లి, ఎర్రపాడును లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసినట్లు పేర్కొన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందే మావోయిస్టు పార్టీని పథకం ప్రకారం తుడిచివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ప్రకారమే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ఈ విధమైన వైమానిక దాడి గురించి గిరిజన గ్రామస్తులలో భయానక వాతావరణం సృష్టించబడిందని, గ్రామస్తులు పొలాల్లో పని చేయడానికి భయపడుతున్నారు ప్రకటనలో పేర్కొన్నారు.