- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మృతదేహంతో వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీ ముందు ఆందోళన

దిశ, వైరా : వైరాలోని వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీ ముందు జాతీయ ప్రధాన రహదారిపై ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ మృతిచెందిన యువకుడి మృతదేహంతో శుక్రవారం గరికపాడు గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. యువకుడి మృతదేహాన్ని ఫ్యాక్టరీ మెయిన్ గేటు ముందు పడుకోబెట్టి జాతీయ ప్రధాన రహదారిపై గరికపాడు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. వివరాల్లోకెళ్తే...వైరా మండలంలోని గరికపాడు గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ గుమ్మ ఉపేందర్ (30) గుండెపోటుతో గురువారం రాత్రి దుర్మరణం చెందాడు. వైరాలోని వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీలో ఉపేందర్ వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగానే గురువారం సాయంత్రం వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీలో ఉపేందర్ విధులకు హాజరయ్యారు. పాల ప్యాకెట్ల లోడు వ్యానును వైరా నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్న ఉపేందర్ సూర్యాపేటలో వాంతులతో గుండెపోటుకు గురయ్యారు.
దీంతో రోడ్డుపై కారులో వెళ్తున్న కొంతమంది ఉపేందర్ గుండెపోటు గురైన విషయాన్ని గమనించి సమీపంలోని హాస్పటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంట వ్యవధిలోనే ఉపేందర్ మృతి చెందాడు. అయితే ఉపేందర్ మృతికి వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ గరికపాడు గ్రామస్తులు శుక్రవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందు ఉపేందర్ మృదేహాన్ని పడుకోపెట్టి ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై సుమారు గంటసేపు రాస్తారోకో చేశారు. విధి నిర్వహణలో ఉపేందర్ మృతి చెందటానికి వైష్ణవి ఫ్యాక్టరీ యాజమాన్యమే కారణమని వారు ఆరోపించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న కొణిజర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని శాంతింప చేశారు. అనంతరం ఉపేంద్ర కుటుంబ సభ్యులతో వైష్ణవి యాజమాన్యం చర్చలు జరిపింది. ఉపేందర్ కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియాగా ఇచ్చేందుకు వైష్ణవి యాజమాన్యం అంగీకరించడంతో గరికపాడు గ్రామస్తులు ఆందోళన విరమించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులు ఉపేందర్ మృతదేహాన్ని గరిగిపాడు గ్రామానికి తీసుకువెళ్లారు. మృతునికి భార్య గంగా లక్ష్మి, ఆరు నెలల పాప ఉన్నారు.