- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కొత్త మండలాల కోసం ఆందోళన ఉధృతం

దిశ, గుండాల : కొమరారం మరియు బోడు మండలాలతో పాటు ఇల్లందును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆందోళన ఉధృతమైంది. గతంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పాటై ఇల్లందులో నూతన మండలాల రెవెన్యూ డివిజన్ కోసం అఖిలపక్ష కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది ఇల్లందులో రెండు రోజులపాటు నిరాహార దీక్షలతో పాటు దశల వారి ఉద్యమం నిర్వహించారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 13 నూతన మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటనలో ఇల్లందులోని కొమరారం, టేకులపల్లిలోని బోడు లేకపోవటంతో గత నెల రోజులుగా తిరిగి ఆందోళన ఉధృతం అయింది.
సీపీఐ ఎంఎల్, ప్రజాప్రంథ నాయకత్వంలో నెలరోజులుగా ఇల్లందు మండలంలోని కొమరాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్షలకు ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు రోజూ మద్దతు తెలుపుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మర్రిగూడెం కేంద్రంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర రెండు మండలాలను తాకుతూ ఇల్లెందుకు చేరుకొని అక్కడ నియోజకవర్గ శాసనసభ్యులకు వినతిపత్రం ఇవ్వనున్నారు.
ఈ క్రమంలోనే న్యూడెమోక్రసీ నాయకత్వం కొమరారం, బోడు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తుంది. ప్రభుత్వం ఇకనైనా నూతన మండలాలు ఏర్పాటు చేయాలని సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు కోరారు. త్వరితగతిన ప్రభుత్వం నూతన మండలాలను ప్రకటించాలని కొమరారం ఎంపీటీసీ అజ్మీర బిచ్చ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా నూతన మండలాల ఏర్పాటును సమర్థిస్తూ ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య మద్దతు ప్రకటించారు. ఇల్లందు ప్రాంతం గతంలో పునర్విభజన సందర్భంలో కూడా అన్యాయానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.