అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ లోకి చేరికలు

by Sridhar Babu |
అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ లోకి చేరికలు
X

దిశ, ఇల్లందు : ఇల్లందు మండలం ముత్తారం కట్టా శాంతినగర్ గ్రామపంచాయతీ లో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ సమక్షంలో బుధవారం వివిధ గ్రామాలకు చెందిన పలు కుటుంబాల వారు బీఆర్​ఎస్​లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ , న్యూ డెమోక్రసీ నుంచి సుమారు 80 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలోకి చేరిన వారికి బానోత్ హరిప్రియ నాయక్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మోసపూరిత నాయకుల మాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ రాష్ట్ర సలహాదారులు

పులి గళ్ళ మాధవరావు, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు మండల అధ్యక్షులు శ్రీలం రమేష్, ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, కో ఆప్షన్ సభ్యులు ఘాజి ,ముత్తారకట్ట సర్పంచ్ మంకిడి కృష్ణ , మసివాగు సర్పంచ్ నందు నాయక్ ,పీఏసీఎస్ డైరెక్టర్ నునావత్ లస్కర్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed