- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్

దిశ ఖమ్మం సిటీ: జిల్లా ప్రధాన ఆసుపత్రిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంవో, డీఎస్వో, వైద్యాధికారులు విధుల్లో ఉన్నది లేనిది పరిశీలించారు. ఐసీయు లు అన్ని పరిశీలించి డీఎం విధుల్లో ఉన్నది లేనిదీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యూరో, సర్జికల్, ఆరోగ్యశ్రీ, మేల్ మెడికల్, సర్జికల్, ఫిమేల్ మెడికల్, సర్జికల్ వార్డులు తనిఖీ చేసి, రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయం అందరికీ అందుతున్నది, లేనిది, మెనూ విషయమై అడిగి తెలుసుకున్నారు. పాయిజన్ కేసు వస్తే, వైద్యాధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు పేదవారు వస్తారని, మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని, వీటిని ప్రజలు వినియోగించుకునేలా చూడాలని, ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు డా. వీణ, డా. నాగరాజు, సిబ్బంది తదితరులు ఉన్నారు.