వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏడీఏ

by Sridhar Babu |
వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏడీఏ
X

దిశ, కూసుమంచి : మండలంలోని నరసింహులగూడెం, మల్లాయిగూడెం, హట్యాతండా గ్రామాలలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి పంట పొలాలను, ఇసుక మేటవేసిన పొలాలను కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు విజయచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. పొలాల్లో అధికంగా నిల్వ ఉన్న నీటిని తీసివేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, నర్సింహులగూడెం సర్పంచ్ జక్కుల వెంకటేశ్వర్లు, మల్లాయిగూడెం సర్పంచ్ రవి, ఏఈవోలు ప్రియాంక, సౌమ్య, సాయిరాం మరియు రైతులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed