- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ కి బలం : ఎమ్మెల్యే వనమా

దిశ, పాల్వంచ : కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ కి బలం అని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు లేనిదే నాయకులు లేరని, వారి త్యాగాల ఫలితమే ఈరోజు నాయకులు అనుభవిస్తున్న అధికారమని కొనియాడారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బరపాటి వాసు, ఎంపీపీ మడివి సరస్వతి, వైస్ ఎంపీపీ మార్గం గురువయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, పెద్దమ్మ గుడి చైర్మన్ మహిపతి రామలింగం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్ మూర్తి, పట్టణ అధ్యక్షులు రాజు గౌడ్, ఎస్వీకే చారి, నాయకులు ఎంఏ రజాక్, కాసుల
వెంకట్, సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, డైరెక్టర్లు ముత్యాల ప్రవీణ్, బేతంశట్టి విజయ్, పూసల కొండల రావు, కలకట్ల నాగిరెడ్డి, సోమ వెంకట్ రెడ్డి, వెంకట్ నారాయణ, ఆడపు చిన్న వెంకటనారాయణ, పవన్, డిష్ నాయుడు, పూసల తిరుపతిరావు శ్రీను, పోస్ట్ ఆఫీస్ వాసు, రాజశేఖర్, అశోక్, మున్న, మజీద్, కొయ్యడ శీను, ఈశ్వర్,నగేష్, గంగు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, వివిధ కమిటీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.