- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
by Sridhar Babu |

X
దిశ, అశ్వారావుపేట : విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొద్దులమడ గ్రామానికి చెందిన బెనుబెల్లి కన్నారావు (24) అనే యువకుడు వినాయకపురంలో పంచాయతీ వీధిలైట్లకు కనెక్షన్ ఇచ్చేందుకు విద్యుత్ స్తంభం పైకి ఎక్కాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగకు తాకడంతో మృతిచెందాడు. అయితే విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా, ఎల్సీ (లైన్ క్లియర్) తీసుకోకుండా కరెంటు స్తంభం పైకి ఎక్కడమే ప్రమాదానికి గల కారణంగా తెలిసింది. వినాయకపురం సర్పంచ్ భర్త పర్యవేక్షణలో ఈ విద్యుత్ బల్బులు మార్పిడి పనులు జరిగినట్లుగా తెలుస్తోంది.
Next Story