- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అతిగా మద్యం సేవించి యువకుడు మృతి

దిశ, కారేపల్లి : కారేపల్లి మండలం గాదెపాడులో యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కారేపల్లి మండలం గాదెపాడుకు చెందిన జక్కుల వినయ్(25) మద్యంకు బానిసయ్యాడు. వినయ్ తన తల్లి నాగమణి వద్ద ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం తల్లి నాగమణి ఊరెళ్లటంతో ఇంటి వద్ద ఒక్కడే ఉండటంతో అతిగా మద్యం సేవించి ఇంటి డాబాపై నిద్రించాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన తల్లి నాగమణి కుమారుడు వినయ్ కోసం వాకబు చేసింది.
మద్యం మత్తులో ఇంటి నుండి వెళ్లి రెండు రోజుల వరకు రాక పోవటం గతంలో జరిగింది. అలాగే జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇండ్లలో వెతికినా జాడ లభించలేదు. ఈక్రమంలో ఇంటి ప్రాంగణంలో దుర్వాసన వస్తుండటంతో శుక్రవారం నాగమణి ఇంటి డాబా పైకి వెళ్లిచూడగా కుళ్లిపోయి పురుగులతో నిండిన శవం కనిపించింది. అధికంగా మద్యం సేవించి నిద్రలోకి జారుకున్న యువకుడు దప్పికతో మృత్యువాత పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ విషయమైన తల్లి ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావు సంఘటన స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.